కీసరి నర్సింగం అంత్యక్రియలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ ప్రముఖులు

కోనరావుపేట నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం (72) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో పోస్ట్ మ్యాన్, కారబార్ గా పనిచేశాడు. చిన్ననాటి నుండి నటనపై అసక్తి కనబరుస్తూ మంచి కళాకారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో గ్రామాలతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి వేదికల్లో నాటక ప్రదర్శన చేస్తూ మంచి పేరుపఖ్యాతలు సంపాదించాడు. అంతేకాకుండా అవార్డులను, సైతం అందుకున్నాడు. తన కళను గుర్తించడంతో ఇటీవల బలగం సినిమాలో సర్పంచ్ గా నటించి అందరి అభిమానాన్ని పొందారు.మృతుడికి భార్య భుమవ్వ, కుమారుడు శ్రీనివాస్, కూతురు అంజలి వున్నారు.

నర్సింగం మరణం తీరని లోటు.

కళాకారుడు, నటకేసరిగా మంచి గుర్తింపు పొందిన కీసరి నర్సింగం మరణించడం కళారంగానికి తీరనిలోటని జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. బుధవారం నాగారం గ్రామంలో జరిగిన నర్సింగ్గం అంత్యక్రియలో పాల్గొన్నారు. నరసింగం పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే నర్సింగం అంత్యక్రియల్లో డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, ఆయా గ్రామాల కళాకారులు, ముదిరాజ్ కులాస్తులు పాల్గొన్నారు. ఆయన మట్టి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *