డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్
మరిపెడ నేటి ధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం, ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంద అన్నారు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది పెద్ద మనసు అని అనేక పథకాలు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు, ఆడపిల్ల పెండ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష 116 రూపాయలు, గర్భం దాల్చితే అంగన్వాడి ద్వారా పోషకాహారం, ప్రభుత్వం ఆసుపత్రిలో నాణ్యమైన ఉచిత కాన్పు, అనంతరం కెసిఆర్ కిట్టు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆయాబిడ్డలు చదువుకోడానికి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడిన కాపాడుతూ వారికి అన్ని తానే నిలిచింది ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.ఈరోజు మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఆడిటోరియంలో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, దంతాలపల్లి, సీరోలు, కురవి, చిన్న గూడూరు, మండలాల [ఎస్సీ-26, ఎస్టీ-56, బీసీ 118, ఈబిసి 08 మైనారిటీలకు02, మొత్తం= 210] మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ రూ/- 2,10,24,360.00/- (రెండు కోట్ల పదిలక్షల ఇరువై నాలుగువెల మూడువందల అరవై వేల రూపాయలు) పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినారు ఇట్టి కార్యక్రమనికి మన ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,ఎంపీపీ అరుణ రాంబాబు, జెడ్పిటిసి శారద రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవికుమార్, డోర్నకల్ జడ్పిటిసి కమల రామనాథం, వైస్ ఎంపీపీ గాదే అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కుడితి మహేందర్ రెడ్డి , అన్ని మండలాల తహసిల్దార్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్స్,పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.