ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన ర్యాలీ

నర్సంపేట,నేటిధాత్రి :

ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో 5 కే రన్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిడిపిఓ రాధిక మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు ఓటరు చైతన్య కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.మానవహారం నిర్వహించి
అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ భారీగా ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ విద్య, హేమలత అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లభారతి, సూపర్వైజర్లు మంజుల,శ్యామల ,శ్రీదేవి,రమాదేవి, మాధవి,రాధ,ఝాన్సీరాణి,హేమలత,నజ్మా ,పారిజాతం, వాసంతి,జయరాణి, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి శిరీష, అరుణ కుమారి,శ్రీదేవి వెంకటలక్ష్మి,రాణి,రమాదేవి,కస్తూరి, సుగుణ, అన్ని మండలాల నాయకులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!