భీఆర్ఎస్ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నవంబర్ 23 :నైటీ ధాత్రి
డిఆర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో పాదయాత్ర లో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పలు సమస్యల గురించి విన్నవిస్తూనే, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందన్నారు. ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.
కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తనకు మద్దతు తెలిపిన అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామంటూ, అందుకు ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమ శేకర్ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామరావు, పావని రెడ్డి,డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కుమార స్వామి,నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.