అర్హుల అందరికి గృహలక్ష్మీ తప్పనిసరి
కౌన్సిలర్ సంపత్
పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు పరిధిలో గృహలక్ష్మి కొరకు దరఖాస్తు చేసిన లబ్ధిదారుల దరఖాస్తులను ఉద్యోగుల పనితీరును పరిశీలించిన కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించుకొనుటకు ఎంపిక చేయడం జరుగుతుందని వార్డు ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ ఆఫీసర్లు విజేందర్,రాధిక, ఆర్పీ.జయప్రద,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.