ఐ ఎఫ్ టి యూ అధ్వర్యంలో లో ఘంగా చేగువేరా, కన్షిరాం వర్ధంతి వేడుకలు.

చెన్నూర్,నేటి ధాత్రి:

చెన్నూరు మండల కేంద్రం లోని మోటార్ వర్క్స్ యూనియన్ ఆఫీస్ లో ఎర్నేస్తో చేగువేరా 56వ వర్ధంతి మరియు మహనీయుడు కాశీరాం 17వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యూ జిల్లా సహాయ కార్యదర్శి బి గోపీనాథ్ మాట్లాడుతు..ఎర్నేస్తో చేగువేరా ప్రపంచ యూత్ ఐకాన్ అర్జెంటీనాలో పుట్టి చీలి,బోలివియా, పేరు,గతేమలా, ఇలా ఎన్నో దేశాలు దాటిపోయి క్యూబా దేశంలో విప్లవం విజయవంతం చేశారు అన్నారు. దేశాలు సరిహద్దులు దాటిపోయినందుకే ఈరోజు ప్రపంచమంతా యువతి యువకులు చేగువేరాను ప్రేమిస్తున్నారు అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం పి వై ఏల్ చెన్నూర్ మండల కార్యదర్శి తగరం వెంకటేష్ మాట్లాడుతూ మహనీయులు కన్షిరాం బహుజన సమాజ్ అభివృద్ధి కొరకు వారి యొక్క రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే,వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారని అన్నారు .ఈ ఇద్దరలో ఒక్కొక్కరికి ప్రత్యేకమైనటువంటి ఒక చారిత్రక గుర్తింపు సృష్టించుకున్నారు.ఈ భూమి మీద మట్టి ఎంత ఉందో వాళ్ళ సెమట ప్రతి మట్టిరవ్వను తాకింది కాబట్టి ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ వారి యొక్క జ్ఞాపకాల ఆదిలో ఆ స్ఫూర్తితో వాళ్ళ ఆశయ సాధనలో మననం చేసుకొని నేటి యువతరం పోరాటంలో భాగం కావాలని అన్నారు.హక్కులు దక్కాలి అంటే మోకాళ్ళ మీద వంగి అడుక్కుంటే రావు,నిలబడి లాక్కుంటేనే వస్తాయని అన్నారు.వంగి 100 సంవత్సరాలు బ్రతికే కంటే నిలబడి నిమిషం బ్రతికిన చాలు అదే వాళ్లకు మనం ఇచ్చే గౌరవం మర్యాద ఘనమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమం లో ఐ ఎఫ్ టి యూ చెన్నూర్ డివిజన్ అధ్యక్షులు మాసాని రమేష్.తెలంగాణ మోటార్ వర్క్స్ యూనియన్ నాయకులు ఎండీ అదిల్.
ప్రగతిశీల యువజన సంఘం చెన్నూర్ మండల అధ్యక్షులు ఎగుడా సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!