మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మర్రిగూడలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్ విష్ణు జగతిలు
సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు,యువత
మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చడంలో
భాగంగా శనివారం మర్రిగూడ మండల మున్నూరుకాపుల సమ్మేళనం జరిగింది.
మండలంలోని రాంరెడ్డి పల్లి శివార్లలో ఏర్పాటైన ఈ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దండు జగన్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్,బండి సంజీవ్,విష్ణు జగతిలు ముఖ్య అతిథులుగా
హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం మునిసిపల్ వైస్ ఛైర్మన్ యాదగిరి,మున్నూరుకాపు ప్రముఖులు వాసుదేవుల వెంకటనర్సయ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, వనమాల
ప్రవీణ్,గుండ్లపల్లి శేషగిరిరావు, ఉప్పు సత్యనారాయణ,పర్వతం సతీష్,వాసాల వెంకటేష్,కోట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.సమ్మేళనానికి కుల బంధువులు,మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.