ఎండల్లో ఎంత యాతన!

`తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుక.

`అటు నాయకులు, ఇటు అధికారులు.

`ఎండలను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి పనులు.

`ఉత్సవాలలో ఇరవై రోజుల పాటు ప్రజలతో మమేకం.

`చెరువులో తట్టెడు మట్టి తీయని వాళ్లు కూడా తెగమాట్లాడుతున్నారు.

`ఊరుకు కళొచ్చిందంటే అది బిఆర్‌ఎస్‌ తోనే…

`పల్లెకు వెలుగొచ్చిందంటే బిఆర్‌ఎస్‌ తోనే

`చెరువే ఊరికి ఆదరువు.

`కుల వృత్తులకు బతుకుదెరువు.

`సాగును కాపాడే కల్పతరువు.

`ఊరందరికీ ఉపకారి చెరువు.

`ఆ చెరువును గాలికొదిలేసిన వాళ్లు మాట్లడడం దెయ్యాలు వల్లించడమే?

`తెలంగాణ రాకపోతే చెరువు లేదు.

`పల్లెకు బతుకుదెరువు లేదు.

`పల్లె వికాసమే లేదు.

`అలాంటి పల్లెను కాపాడుతున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజల గుండెల్లో వున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజలకు ఆమడ దూరంలో వున్నవి ప్రతిపక్షాలు.

`అధికారంలో వున్ననాడు పట్టించుకోలేదు…ప్రతిపక్షంలో వుండి ప్రగతిని ఓర్చుకోలేరు.

`అందుకే ప్రతిపక్షాలు ప్రజల దరి చేరడం లేదు.

`ప్రజా సంక్షేమం ప్రతిపక్షాల డిక్షనరీలోనే లేదు.

`అందుకే అభివృద్ధి వారి కళ్లకు కనిపించదు.

`అభివృద్ధి వారికి సహించదు.

`అభివృద్ధి అంటే బిఆర్‌ఎస్‌… సంక్షేమం అంటే కేసిఆర్‌. ఇదీ జనం మాట.

హైదరబాద్‌,నేటిధాత్రి:                తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ బిఆర్‌ఎస్‌ నాయకులు యాతన పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా అది ఎంతో సంతోషంగానే స్వీకరిస్తున్నారు. ప్రజల కోసం పడుతున్న ఇబ్బందులను ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఉద్యమ కాలం నాడు అటుకులు బుక్కి ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్‌ నేతలే…ఇప్పుడు అధికారంలో వున్నా, మండుటెండల్లో ప్రజలకు చేరువలో వున్నదికూడా బిఆర్‌ఎస్‌నేతలే…కాని పని లేని ప్రతిపక్షాలు ఇళ్లు కదలకుండా అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పల్లెల కాంతులను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు చీకొడుతున్నారు. ఏనాడైనా గతంలో అధికారంలో వున్న పార్టీలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు చేశారా? అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఆనాడైనా ఈనాడైనా ప్రజల్లో వున్నది, వుండేది బిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు అన్యాయం జరక్కుండా చూసింది కూడా బిఆర్‌ఎస్సే. ఆనాటి పాలకులు చేసిన ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించింది బిఆర్‌ఎస్సే. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు కరంటు బిల్లులు విపరీతంగా పెంచినప్పుడు ప్రశ్నించింది ముందు ఆనాటి ఉప సభాపతిగా వున్న కేసిఆరే…ఆనాడు విద్యుత్‌ చార్జీల ఉప సంహరణకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి, ప్రజల్లోకి వచ్చింది కేసిఆరే..అలా ఆయన ప్రజల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా ప్రతిపక్షంలో వున్నా, నేడు అధికారంలో వున్నా ప్రజల్లో వుండే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్సే. ఇక తెలంగాణ ఉద్యోగులు సైతం దశాబ్ధి ఉత్సవాలలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల మన్నననలు పొందుతున్నారు. గతంలో అధికారులు కార్యాలయాలు వదిలి బైటకు వచ్చేవారు కాదు. నాడు పాలకులు ప్రజల్లోకి వచ్చేవారు కాదు. అదికారులను పనిచేయనిచ్చేవారు కాదు. పాలకుల ఇష్టారాజ్యం అన్నట్లు వుండేది. కాని నేడు ప్రభుత్వ పెద్దలు ఎంతగా ప్రజల్లో వుంటున్నారో, అదికారులు కూడా అంతగా ప్రజలకు చేరువౌతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాని ప్రతిపక్షాలు మాత్రం రోజు రోజురోజుకూ ప్రజలకు దూరమౌతున్నారు. 

 తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు మండుటెండల్లో జరుగుతున్నాయి. 

ఉదయం వేళలోనే సూర్యుడు చుర్రుమంటున్నాడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోనే వుంటున్నారు. దశాబ్ధి ఉత్సవాలలో నిత్యం పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులలో కనిపించే అంకితభావం మరో పార్టీలో వుండదు. అందుకే తెలంగాణ ప్రజలు ఇతర పార్టీలకు స్ధానం లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా చెరువుల పండగ అన్నది ఎంత గొప్పగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు, పత్రికలు లేని పోని కథనాలు వండి వార్చడాన్ని ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పల్లెలు ఎలా వుండేవి? ఇప్పుడు ఎలా వున్నాయన్న విషయం తెలిసి కూడా తెలియనట్టు, ప్రజలను ఏమార్చే కనికట్టు ప్రతిపక్షాలు చేయాలని చూస్తే ప్రజలు హర్షించరు. ఇప్పటికే ప్రతిపక్షాలను ప్రజలు ఆదరించడం లేదు. అయినా వారిలో మార్పు రావడం లేదు.

తెలంగాణ వచ్చాక ఊరు మారింది.

 చెదిరిన కల కొత్త రూపును సంతరించుకున్నది. పల్లెకు మళ్లీ కొత్త సొగబు వచ్చింది. పల్లె రూపులకు రేఖలకు కొత్త కళ వచ్చింది. ఎండిన పైర్లు, బీడు వారిన భూములు, పల్లెర్లు మొలిచి పొలంఆనావాలు లేని భూములకు మళ్లీ మట్టివాసన అద్దింది. పూడిపోయిన బావులకు ఊటలు వచ్చాయి. ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వచ్చాయి. పచ్చదనం పెరిగింది. ఊరి చెరువు బాగుపడిరది. చెరువు కట్టలకు కొత్త దనం వచ్చింది. చెరువు కట్టల మీద ఊత వనాలు పురుడుపోసుకున్నాయి. చెరువు కట్టంతా అల్లుకున్నాయి. ఊరే చెరువుకు ఆదరవు. ఊరులో చెరువుంటే ఊరంతటికి కల్పతరువు. ఊరిలో చెరువుంటే, అది నిండుగా వుంటే పంటలకు కొదవలేదు. అందుకే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెరువుల పండగ మిషన్‌ కాకతీయను మొదలుపెట్టారు. ముందు చెరువుల బాగోగులు చూశాడు. చెరువులను మరమ్మత్తులు చేయించాడు. పాత కట్టల స్ధానంలో మరింత కొత్త కొత్త కట్టలు నిర్మాణం చేయించాడు. చెదిరిన చెరువులను తవ్వించాడు. పూడికను రైతుల భాగాస్వామ్యంతో పొలాలలకు మళ్లింపజేశాడు. చెరువుల పూడిక కార్యక్రమం పండగలా చేయించాడు. ,చెరువులన్నీ గోదారి జలాలలో నింపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకించారు. దాంతో తెలంగాణ పల్లె రూపు ఒక్కసారిగా మారిపోయింది. వందేళ్ల కింది గొలుసుకట్టు చెరువులకు మళ్లీ కల వచ్చింది. చెరువుల్లోకి నీరొచ్చింది. బావులకు ఊటలొచ్చాయి. ఎండిన బోర్లు ఎల్లబోశాయి. పడావు పడిన భూములు మళ్లీ పొలాలయ్యాయి. వలసవెళ్లి రైతులంతా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. వ్యవసాయం సాగిస్తున్నారు. రైతు బంధు అందుకుంటున్నారు. పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. అఫ్పులేకుండా వ్యవసాయం సాగిస్తున్నారు. ఇరవైనాలుగు గంటల ఉచిత కరంటు అందిస్తున్నారు. పండినపంటలను రైతు కల్లాల దగ్గరకే అధికారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంలో రైతులే మార్కెట్‌ యార్డుకు తరలించి అమ్ముకునే దుస్ధితి నుంచి బైటపడ్డారు. రైతు తన పంట రాశి మీద దర్జాగా కూర్చొకొని తనదగ్గరికే అదికారులొచ్చి కొనుగోలు చేసుకుంటుంటే రాజులా తన ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడు. ఇదీ ఇప్పుడు తెలంగాణ రైతు అనుభవిస్తున్న ఠీవి. మరి గతంలో రైతుపరిస్ధితి ఎలా వుండేది. చెరువు దుస్దితి ఎలా వుండేదో ప్రతిపక్షాలకు తెలియంది కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 45 సంవత్సరాలు పాలించినా, ఏనాడు తెలంగాణకు చుక్క నీరు తెచ్చే యోచన చేయలేదు. నాటి పాలకులతో కొట్లాడి సాధించింది లేదు. చెరువుల బాగోగులు చూసంది లేదు. కనీసం చెరువుల పూడిక తీస్తే, తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని అడిగింది లేదు. కాని నేడు చెరువుల పండగతో కులవృత్తులకు మేలు జరిగింది. అందుకే ఊరూరు చెరువుల పండగ జరుపుకుంటోంది. ఒకనాడు చెరువుల్లో నీళ్లు లేవు. చేపలు లేవు. ముదిరాజ్‌లకు ఉపాధి లేదు. కాని నేడు చెరువుల్లో పుష్కలమైన మత్య్స సంపద. ముదిరాజ్‌కు కళ్లముందు ఉపాధిపండగ. రజకులకు కూడా చెరువుల ద్వారా కుల వృత్తిపోషణ జరుగుతోంది. ఇలా రైతులకు మేలు జరుగుతోంది. చెరువు కట్టలపై వెలసిన ఈత వనాల మూలంగా గౌడసామాజిక వర్గానికి మరింత ఉపాది దొరికింది. ఇలా చెరువు ఊరికి కల్పతరువైంది. పూర్వం తెలంగాణ పల్లె సింగారం మళ్లీ ఇప్పుడు కళ్లముందు కదలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలలో చెరువు ఒక గొప్ప వరంగా మారింది. ప్రజలకు జీవనాడిగా మారింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే, ఊరు బాగు పడిరదంటే అది ముఖ్యమంత్రి కేసిఆర్‌పుణ్యమే…ఆయన ఆలోచనల రూపమే…పచ్చని పైట సింగారించకున్న పల్లె ముస్తాబుకు సాక్ష్యమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *