ఉత్పత్తి మరియు పని తీరు పై  పత్రికా ప్రకటన

ఉత్పత్తి మరియు పని తీరు పై 

పత్రికా ప్రకటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం జి.ఎం. ఆఫీసు నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రెస్ మీట్ జరిగినది. దీనికి కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ గారు మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు హాజరు అయినారు.  

 

         ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ మాట్లాడుతూ , కొత్తగూడెం ఏరియా 2022-2023 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 12.00 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 08.66 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 72 % ఉత్పత్తి సాధించడం జరిగినది. 

 

 అలాగే కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 71.47 లక్షల టన్నులకు గాను 62.34 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 87 శాతం ఉత్పత్తి సాదించామని తెలిపినారు. 

   

   మరియు రోడ్డు మరియు రైల్ ద్వారా అక్టోబర్ నెల 8.66 లక్షల టన్నులు మరియు ఏప్రిల్ నుండి అక్టోబర్ 31 వ తారీకు వరకు 66.26 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినధి అని కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ పత్రిక ప్రకటనలో భాగంగా తెలియజేసారు.

 ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటు జి‌ఎం శ్రీ రమేశ్, ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి, ఏజి‌ఎం సూర్యనారాయణ, డి.జి‌.ఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి‌.ఏం.(ఐ.ఈ) యోహాన్ , ఆర్.సి.హెచ్.పి. డి.జి‌.ఏం.(ఈ&ఎం) వెంకటేశ్వర్లు, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, పర్చేస్ ఎస్.ఈ(ఈ&ఎం) బులి మాధవ్, ఏరియా స్టోర్స్ ఎస్.ఈ(ఈ&ఎం) ప్రకాష్, మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!