ఉత్తదే.. జగడం ఉత్తుత్తి ..రగడం

`రక్తి కట్టిస్తున్న తండ్రీ కూతుళ్లు!

`తండ్రి మీద కోపం వున్నట్లు కూతురు?

`కూతురు మీద ప్రేమతో భూములు కొన్నట్లు తండ్రి?

`ఆక్రమించుకున్నారన్న అపవాదు మాయం చేసేందుకు? 

`అద్భుతమైన నటనకు తెరతీశారు?

`అటు సానుభూతి కోసం!

`ఇటు భూమి కొన్నట్లు రుజువుల కోసం?

`లా పాయింట్‌ తో ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం?

`తండ్రిని నిలదీయాలంటే ప్రజల్లోకి రావాలా?

`తన సంతకం ఫోర్జరీ చేశాడని వీధికెక్కడం ఎందుకు?

`ఆ భూములు కూతురు ప్రజలకు రాసిస్తే చాలదా?

`ఎక్కడైనా ఆస్థులు ఇవ్వకుంటే గొడవలు చూస్తాం?

`నాకు ఆస్తిమీద ఆసక్తి లేదన్నట్లు నటన కొత్తగా చూస్తున్నాం?

`ఆ ఆస్థులు వద్దనుకుంటే ప్రజలకు రాసివ్వండి?

`జనం అంటున్నట్లు, భూముల ఆక్రమణ కాదని నిరూపించాలి?

`కూతురు పేర కొన్నట్లు చర్చ జరగాలి?

`న్యాయ స్థానాన్ని తప్పు దోవ పట్టించాలి?

`ప్రజలను మాయ చేయాలి?

`జాగలపై జనగాం ఎమ్మెల్యే జంతర్‌ మంతర్‌!?

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాను రాను రాజకీయాలలో ఏది నీతో, ఏది అవినీతో అర్థం కాకుండా పోతోంది. ఏది నిజాయితో, ఏది సానుభూతో ఏది తెలియకుండా పోతోంది. ఏది అక్రమమో, ఎంత కక్కుర్తో కనపడకుండా పోతోంది. మనుగడ కోసం ఎంతటికైనా దిగజారడం బెటరని నిరూపించే దాకా వెళ్తోంది. అదేంటో చిత్ర, విచిత్రమైన రాజకీయాలన్నీ తెలంగాణలోనే కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయాలలో కుటుంబ సభ్యుల మధ్య కూడా రాజకీయ వైరం కనిపించేది. వేర్వేరు పార్టీలలో వుంటూ, అందరూ ఒకే గూడులోనే వుంటూ రాజకీయాలు చేసేవారు. బయటకు రాగానే తిట్టుకునేవారు. ఇంటికి చేరుకోగానే కలిసి భోంచేసే వారు.వాళ్ల కోసం బైట నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే వారు. జనం కూడా రాజకీయాలంతే అనుకునే వారు. ఇప్పుడు రాజకీయాలు వ్యాపార ముసుగేసుకున్నాయి. వ్యాపారాలు సాగిస్తే గాని రాజకీయాలు గడవని రోజులొచ్చాయి. ఆక్రమణలు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలను అమాయకులను చేసి ఆడిరచేందుకు రాజకీయాలు వేధికలౌతున్నాయి. సంపాదనలకు మార్గాలౌతున్నాయి. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత పోగేసుకునేందుకు ఎంతకైనా దిగజారిన కాలం కళ్లముందు కనబడుతోంది. 

నాన్న…నా సంతకం ఫోర్జరీ చేసి ఆ స్థలం ఎందుకు కొన్నావు? 

కూతురు నిలదీత. అవన్నీ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం..ఇప్పుడు తండ్రి మాట. ఇక్కడే తేలిపోవాలి. కూతురు వాదన. నా సంతకం ఫోర్జరీ ఎందుకు చేశావ్‌? నా పేరు మీద భూమి ఎందుకు కొన్నావ్‌? ఇదీ కూతురు పదే, పదే అడుగుతున్న ప్రశ్న. పాపం తండ్రికి ఎంత కష్టమొచ్చింది. కూతురు నిలదీస్తోంది…ప్రతిపక్షాలు అందిస్తున్నట్లు ఆడుతోంది. అయ్యకే ఎదురుతిరుగుతోంది. పార్టీ నాయకుల ఆవేదన. అయినా కన్న తండ్రి భూమి కొనిస్తే ఎందుకు కొన్నవంటుంది. తండ్రిని ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి కూతురు ఎవ్వరికీ వుండోద్దు ? సగటు నాయకుడి ఆవేదన. అదేంటి తన తండ్రి ఎమ్మెల్యేగా వుండి ఆ భూములు ఆక్రమించుకున్నాడని కదా? జనం అనుకుంటున్నది. ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని కదా? ప్రజలు ఆరోపిస్తున్నది. మరి కూతురు పదే పదే ఎందుకు కొన్నావు…నాన్న అంటూ ప్రశ్నిస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనేది అందరికీ అర్థమైవుంటుంది. ఆయన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. కూతురు తుల్జా భవానీ రెడ్డి. చెరువు శిఖం భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారనేది రైతుల వాదన. నా పేరు మీద ఎందుకు కొన్నావంటూ కూతురు వితండ వాదన. ఇదే కూతురు సరిగ్గా గత ఎన్నికల ముందు చేర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద భూమిని ప్రజలకు పంచుతానంటూ రైతులకు హామీ ఇచ్చింది. ఎన్నికలయ్యాక ఫలానా రోజు వస్తానని మాట ఇచ్చి వెళ్లిపోయింది. ఎన్నికలు అయిపోయాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మళ్ళీ గెలిచాడు. ఇక ముత్తిరెడ్డి కూతురు వస్తుందని రైతులు ఎదురు చూశారు. కానీ ఇంత వరకు రాలేదు. మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. మళ్ళీ కూతురు రంగంలోకి దిగింది. ఇప్పుడు తండ్రి తో గొడవ నాటకానికి తెరతీసింది. ఆక్రమణ అన్నది జనం మర్చిపోయి, కొన్నారన్న దానికి బలం చేకూర్చే ఎత్తుగడ మొదలుపెట్టింది. రైతులు వేసిన కేసు వీగిపోవాలంటే కూతురు పేరు మీద కొనుగోలు అన్నది తెరమీదకు వస్తే, ఆక్రమణ అన్నది పక్కకు వెళ్లిపోతుంది. లీగల్‌ గా ఎదురయ్యే అవాంతరాలు దూరమౌతాయి. ఇదీ అసలు సంగతి. కూతురు కోపంగా వచ్చినట్లు, నాన్న మీద చిర్రుబుర్రులాడినట్లు కాసేపు, వెళ్లే ముందు నాన్న వెళ్తున్నాను..అంటూ నవ్వుకుంటూ వెళ్తుంటే జనం వెర్రివెంగలప్పలౌతున్నారు. ఆ స్థలం కూతురుకు అవసరం లేకపోతే, ప్రజలకు రాసి ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం. గతంలో రైతులకు రాసిస్తానని తప్పించుకోవడంలో ఆంతర్యం…అంతా ఉత్తుత్తి లొల్లి. నిజంగా తండ్రి మీద కూతురుకు కోపం వుంటే ఇళ్లు పీకి పందిరేస్తుంది. లేకుంటే ఇంటి ముందు ధర్నా చేపడుతుంది. తండ్రికి చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పరం చేస్తుంది. ఇవన్నీ ఏవీ జరగడం లేదు. తండ్రి, కూతుళ్ల జగడం ఆగడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *