కేసముద్రం (మహబూబాబాద్),నేటి ధాత్రి:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జిల్లా లోని తన స్వగ్రామం ఇనుగుర్తి గ్రామాభివృద్ధి గురించి పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును కలిశారు.సోమవారం ఆయన మంత్రుల నివాసంలో దయాకర్ రావును కలిసి ఇనుగుర్తి మేజర్ గ్రామ పంచాయతీ అని,ఇటీవల మండల కేంద్రంగా కూడా అవతరించిన విషయాన్ని గుర్తు చేస్తూ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు.ఎంపీ వద్దిరాజు మంత్రి ఎర్రబెల్లికి గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి పట్ల మంత్రి రవిచంద్ర సానుకూలంగా స్పందించారు.