మహబూబ్ నగర్/ నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ప్రియాంక బాలానగర్ ఓ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. ప్రియాంక ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించల క్యాన్సర్ గా నిర్ధారణ అయింది. వైద్య ఖర్చుల కోసం రూ.30 లక్షలు అవసరమని డాక్టర్లు తేల్చారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 440- 435 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ప్రియాంక ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. దాతలు ఎవరైనా.. 99510 82091, 96185 42334 ఫోన్ నెంబర్లకు గూగుల్ పే.. ఫోన్ పే చేసి, తన ప్రాణాన్ని కాపాడాలని ప్రియాంక కోరింది.