ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా
నవాబుపేట మండలం లోని చౌడూర్ గ్రామంలో జెడ్పి ఉన్నత పాఠశాలలో 2001 -2002 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .సుమారు 22 ఏళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులతో కలిసి జ్ఞాపికలను అందజేసి .శాలువలతో ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా గురువులు గోపాల్ రెడ్డి, అబ్దుల్ హక్, వసంత, అమరావతి, పద్మ ,శ్రీనివాస్ ,శ్రీధర్ గౌడ్, ఆంజనేయులు, వెంకటయ్య ,ఖలీద్, ప్రసంగించారు.తల్లిదండ్రులను గౌరవించాలని వృద్ధా శ్రమలో వారిని చేర్పించకూడదని చివరాకాలంలో తల్లిదండ్రులను ప్రేమగా చూడాలని వారు సూచించారు.22 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల మొఖంలో ఆనందం సంతోషమని వెలుసలు కనిపించాయి .పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేసుకొని పెద్ద టాస్కని చేయడం చాలాకష్టంలో కూడుకున్న పని అని అందరి అడ్రస్సులు, ఫోన్ నెంబర్లు, సేకరించి అది సుదీర్ఘ కాలం 22 ఏళ్ల తర్వాత అందరినీ కలుపుకొని గెట్ టు గెదర్ ని విజయవంతం చేయడం మామూలు విషయం కాదని గురువులు కితాబిచ్చారు.కొంతమంది పూర్వ విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని భుజానికి వేసుకొని ఇంత ఖర్చు పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం. ఎక్కడేక్కడో ఉన్న మా టీచర్లని ఒకే వేదిక పైకి తీసుకురావడం సంతోషంగా ఉంది అని వారు చెప్పుకోవచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లాల వెంకట్, ఎఎంసి చైర్మన్ గోపాల్ యాదవ్ , ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, పరుశురాం ,సుదర్శన్, శేఖర్ ,పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!