పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే
పరిష్కరించాలని ఎబివిపి హనుమకొండ లో విద్యార్థులతో శవయాత్ర మరియు మహా ధర్నా నిర్వహించడం జరిగింది కేవలం విద్యార్థుల పట్ల చూపిస్తూ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు ఫీజు
రియంబర్స్మెంట్ రకా చదువుకి దూరం అవ్తునారు పేద విద్యార్థులు ఉన్నంత చదువు చదవాలని గవర్నమెంట్ హాస్టల్స్ లో సౌకర్యాలు సరిగ్గా లేక ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు వెంటనే గవర్నమెంట్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది ఇలాగే విద్యార్థుల పట్ల నీ నిర్లక్షల పాలన కొనసాగిస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థులు నిన్ను ఏ గద్దె
ఎక్కించారో ఆ గద్దె దించడానికి తెలంగాణ లో ఉన్న విద్యార్థులకు ఎక్కువ సమయం పట్టదు కేసీఆర్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ పాలనలో ఇంతవరకు
విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు బహుశా కేసీఆర్ ఉద్దేశంలో బంగారు తెలంగాణ అంటే ఊరుకో బారు గల్లికో వైన్స్ ఏర్పాటు చేయడమే కెసిఆర్
లక్ష్యంగా బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ పనిచేస్తుండు నీ నిర్లక్ష్య పాలనని విద్యార్థుల పట్ల కొనసాగిస్తే ఎబివిపి నిన్ను విడిచిపెట్టదు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు, రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట
హర్షవర్ధన్ , , వరంగల్ మహానగర కార్యదర్శి ఆరేపల్లి సుజిత్, హనుమకొండ జిల్లా కన్వీనర్ అయితే నిఖిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నమిత, భాను వరప్రసాద్, అరుణ్, జోనల్ ఇన్చార్జులు గణేష్, మనోజ్, సిద్దు, కార్యకర్తలు రోహిత్, భరత్, ఆశిష్, స్వామి, శ్రీనివాస్, కౌశిక్, శివ, రాకేష్, జశ్వంత్, సాయి, పవన్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
*డిమాండ్స్.*
*1. పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని*
*2. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న పాయిజన్ గురించి హైకోర్టు సీటింగ్ జడ్జి గారితో విచారణ జరిపించాలి*
*3.300 గురుకులాలకు నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి*
*4. పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించి ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి*
*5. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి*