చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లలో శుక్రవారం రోజున ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి పిల్లలకు ప్రీస్కూల్ కిట్టు పై అవగాహన నిర్వహించడం జరిగిందని సూపర్వైజర్ జయప్రద తెలిపారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ పూర్ణచందర్రావు పాల్గొన్నారు, సూపర్వైజర్ జయప్రధ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఎల్కేజీ యూకేజీ నర్సరీ కి సంబంధించిన ప్రీస్కూల్ కిట్టును మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ పంపించడం జరిగింది. ఈ కిట్టును పిల్లలకి ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని సూపర్వైజర్ జయప్రద హాజరై వివరించడం జరిగింది. పిల్లలకు ఆటపాట కథతో పాటు ఎల్కేజీ యూకేజీ నర్సరీ కి సంబంధించిన అక్షరాలు అంకెలు ఇంగ్లీష్ చిన్న చిన్న పదాలు ఈ కిట్టు లో ఉన్న బుక్స్ ద్వారా పిల్లలకి నేర్పించినట్లయితే డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ కు వెళ్లడానికి వీలు పడుతుందని అలాగే తల్లులందరూ మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలను ప్రైవేటు స్కూలుకు పంపకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని వివరించడం జరిగింది. ఎంపీటీసీ అనిల్ మాట్లాడుతూ పిల్లలను ప్రైవేటు స్కూల్ కి పంపించడం వల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా ఫీజుల రూపంలో ఎన్నో ఖర్చులు పెట్టుకోవలసి వస్తుందని. కాబట్టి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని వివరించారు. హైస్కూల్ హెడ్మాస్టర్ మాట్లాడుతూ 14 నుండి 18 సంవత్సరాల బాలికలకు లోప పోషణ రక్తహీనత తగ్గించుటకు జిల్లా కలెక్టర్ పంపించిన కిశోరామృతం పిల్లలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ , ఎంపీటీసీ కట్కూరి పద్మ ,, హై స్కూల్ హెచ్ఎం శ్రీరాం రఘుపతి , ప్రైమరీ స్కూల్ టీచర్ నవత , అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, అరుణ, జ్యోతి ఆయాలు పద్మ, శైలజ మరియు మహిళలు పాల్గొన్నారు.