*రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్*

• కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించిన మంత్రి

• ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన

• త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్

• పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి ఈ విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలి

• ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ తో కలిసి మునిసిపల్ శాఖ ఈ రోజు విడుదల చేస్తుంది.

• ప్రస్తుతం పాటిస్తున్న మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, సనిటైజర్ల వినియోగం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరిన మంత్రి

• కరోనా పరిస్థితులను సమీక్షించిన తరువాత రానున్న వర్షాకాలనికి సంబంధించిన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పైన పురపాలక మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు

• ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటికి కొరత ఎక్కువగా లేదని తెలిపిన మున్సిపల్ కమిషనర్లు

• ఇప్పటికే పురపాలక శాఖ ఆరోగ్య శాఖ తో కలిసి తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ను ఆధారంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం

• ఇప్పటి నుంచే వర్షాకాలంలో రానున్న డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ పైన చర్యలు చేపట్టాలని ఈ మేరకు గతంలో వారం కొకసారి యాంటీ లార్వా ఆక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించాలని కోరిన మంత్రి కేటీఆర్

 

• రేపటి నుంచి డెంగ్యూ నివారణ లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న పురపాలక శాఖ

• ఇందులో బాగంగా యాంటీ డెంగ్యూ చర్యలను తీసుకోవాలని సూచన.

• ప్రతి పట్టణంలోని మురికి కాలువలను పరిశుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ కార్యక్రమాలను ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం

• ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని సూచన

• పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కవచాలు మాస్కులు బ్లౌజు ల లేకుండా పని చేయరాదు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా కార్య క్షేత్రం లో కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్ లదే అవుతుందన్న మంత్రి కేటీఆర్.

• పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలి

• ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి ద్వారా 830 కోట్ల రూపాయలను విడుదల చేశాం. ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాల పైన ఒక నివేదికను రూపొందించి వెంటనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *