హన్మకొండ, నేటిధాత్రి:
ఈ రోజు జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ శ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, రాయపుర కాలనీలో చదువు,రోడ్డు ప్రమాదాలు, షీటీమ్స్,,డయల్100,, సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలపై మేజిక్ షో,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి చెప్పడంజరిగంది.ఈ కార్యక్రమానికి హన్మకొండ సీఐ ,ఎస్ఐ ,డివిజన్ కార్పొరేటర్,పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జి ఉమెన్ ఏఎస్ఐ శ్రీమతి నాగమణి గారు, సభ్యులు, ఎచ్సీఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు, పీసీ రత్నయ ఎచ్జీఎస్, శ్రీనివాస్, విక్రంరాజ్ నారాయణ, మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.