15,16,17 తేదీలలో మూడు రోజులపాటు జరగబోయే కెసిఆర్ జన్మదిన వేడుకలను పరిశీలించిన తూర్పు ఎమ్మెల్యే
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి చివరకు తెలంగాణ కొరకై తన ఊపిరినే వదలడానికి సిద్ధపడి తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అనే నినాదంతో అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో జననేత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో 15,16,17 తేదీల లో మూడు రోజులపాటు జరగబోయే కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుటకు గాను ఎమ్మెల్యే నరేందర్ 27డివిజన్ లోని అజంజాహి మైదానం స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధే లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుటకు కంకణం కట్టుకున్న తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ వేడుకలకు ప్రజలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, గుండేటి నరేందర్, చింతాకుల అనిల్, బాలిన సురేష్, భోగి సువర్ణ సురేష్, వస్కుల బాబు, ఓని స్వర్ణలత భాస్కర్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, రాష్ట్ర నాయకులు నీలం రాజ్ కిషోర్, చింతాకుల సునీల్ కుమార్, గోరంట్ల మనోహర్, దుబ్బ శ్రీనివాస్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.