పెళ్లి రోజు వేడుకలు
మొక్కలు నాటిన బీఆర్ఎస్ నాయకులు
హైస్కూల్, ప్రైమరీ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ
బోయినిపల్లి,నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయినిపల్లి వినోద్ కుమార్-మాధవి, రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్-రోహిణి పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య, మాజీ డీసిఏంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, బిఅర్ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్, మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్యలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అలాగే భిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నాగుల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో హైస్కూల్ , ప్రైమరీ విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రైతు సమితి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రావు, సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, హై స్కూల్ చైర్మన్ ఎర్ర మల్లారెడ్డి, ఎంపీటీసీ ఐరెడ్డి గీత మల్లారెడ్డి, ఎంపిటిసి డబ్బు మమత సుజన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కొండం నారాయణరెడ్డి, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు సాంబ లక్ష్మి రాజం, భీమనాథుని రమేష్, ఉద్దెల మహేందర్, కట్ట గోవర్ధన్, కడుదుల తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.