ఏఈ ని తప్పించేందుకు మరో కుట్ర.! మండలానికి ఎస్సీ రానున్నట్లు సమాచారం..!?

 

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు.?

కమిషనర్, ఈ అండ్ సి, ఏఈ వ్యవహారంపై సీరియస్, విజిలెన్స్ విచారణకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం..?

ఏఈ ఏమి చేయలేదు కుట్రపూరిత భాగంలో ఎస్సీ ముందస్తు రిపోర్ట్ అందించే ప్రయత్నం.?

సార్ ఏవీ కాలేదు అంతా వట్టిదే, ముందుగా రిపోర్టు ఇవ్వండి ఈ ఈ ,ఎస్ ఈ ముందుగా లే మంతనాలు చేసుకున్నట్లు సమాచారం..!?

నేటిధాత్రి ముందే చెప్పింది  భారీ కుంభకోణంలో ఏఈ నుండి ఎస్సీ వరకు పాత్ర ఉందని,  ఎస్సీ పర్యటన మరిన్ని నిజాలు వెలికి తీస్తుంది..!?

ఉమ్మడి మండలంలోని రాజేందర్ రెడ్డి  బాధితులంతా తమ గోడును వెళ్లబోసే సమయం ఆసన్నమైంది..!

మహాదేవపూర్-నేటిధాత్రి:

కోట్లరూపాల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఇరవై తొమ్మిది రోజులు కథనాలు రావడంతో ఉన్నత అధికారులు ఏ ఈ కుంభకోణం విషయం పై ఆగ్రహించినట్లు తెలుస్తుంది. ఉన్నత అధికారి విచారణ చర్యలకు ఆదేశించటం జరుగుతుందని తెలుసుకున్న జిల్లా స్థాయి అధికారులు మరో కుట్రపూరితమైన వ్యవహారాలు ఏ ఈ ను రక్షించే క్రమంలో పడ్డారు. జిల్లాస్థాయి అధికారులు ముందుగానే చర్చించుకుని మండలానికి సందర్శించి బినామీ కాంట్రాక్టర్లతో చర్చించి ఎలాంటి అవకతవకలు జరగలేదని రిపోర్టు రాసి అందించుటకు ప్రయత్నం చేసే క్రమంలో పని ఉమ్మడి జిల్లాల అధికారి ఎస్ ఈ మండలానికి సందర్శించి పై అధికారికి మండలం లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుటకు ముందే సిద్ధమై మహదేవ్పూర్ మండలానికి రానున్నట్లు తెలుస్తుంది.

 

 *ఏఈ ని తప్పించేందుకు మరో కుట్ర.!నేడు మండలానికి ఎస్సీ రానున్నట్లు సమాచారం..!?* 

 

మహాదేవపూర్ మండల పంచాయతీ రాజ్ ఇంజినీర్ రాజేందర్ రెడ్డి మండలంలో అభివృద్ధి పనుల పేరిట చేపట్టిన పనుల్లో కోట్ల రూపాయల కుంభకోణానికి శ్రీకారం చుట్టిన విషయం గత 68 రోజుల నుండి వరుస కథనాలు ప్రచురించడం తో ఎట్టకేలకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి మండలంలో జరిగిన అవినీతిపై విచారణ వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహించడం జరిగిందని సమాచారం. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారి రాజేందర్రెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకునేలా వ్యవహరించడం జరుగుతున్నాయి ముందే పసిగట్టిన అధికారులు రాజేందర్ రెడ్డి కుంభకోణం విచారణ జరిపిస్తే ఎలాగైనా అసలు వ్యవహారం కోట్ల రూపాయల దుర్వినియోగం సాక్షాలతో బయటపడుతుందని జిల్లా స్థాయి అధికారులు ముందస్తుగా చర్చించుకోవడం జరిగింది. నీతో పాటు అవినీతి కుంభకోణంలో తాము కూడా పాత్రధారులే అన్న విషయం గుర్తుకొచ్చి ఏ ఈ పై చర్యలు తీసుకుంటే తాము కూడా భాగస్వాములమే అవుతామని భావించిన అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. మహదేవ్పూర్ మండలంలో అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయలకు జేబుల్లోకి మళ్లించిన రాజేందర్ రెడ్డి వాటిలో జిల్లాస్థాయి అధికారులు కూడా అలాగే ప్రజాప్రతినిధులు కూడా పాత్రలే కావడం ఇక రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారికి అవినీతి వ్యవహారం తెలియడంతో ఇక చేసేదేమీలేక మండలాన్ని సందర్శించి ఈ ని కాపాడేందుకు మరో కుట్ర పూరితమైన వ్యవహారాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. శాఖ ఉన్నతాధికారి ఆ దేశాలకు ముందే తమదైన శైలిలో మండలాన్ని సందర్శించి ఉన్నత అధికారి సైతం పక్కదారి పట్టించేందుకు ఉమ్మడి జిల్లా అధికారి ఎస్ ఈ నేడు మండలానికి సందర్శించినట్లు విశ్వసనీయ సమాచారం.

 

 *కమిషనర్, ఈ,ఎండ్ సి, ఏఈ వ్యవహారంపై సీరియస్, విజిలెన్స్ విచారణకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం..?* 

 

మహాదేవపూర్ మండలానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల కుంభకోణం సాక్ష్యాధారాలతో పలు బాధితుల ద్వారా మీడియా ముందుకు వరుస కథనాలు రావడం అలాగే పలు బాధితులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు నేటి వరకు ఒకవైపు బినామీ కాంట్రాక్టర్ల బెదిరింపులు బేరసారాలు సాక్షాలు బాధితులు ప్రజల ముందుకు వచ్చినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు చర్యలకు ససేమిరా అనడంతో కుంభకోణంలో ఉన్న ఏ ఈ రాజేందర్ రెడ్డి ని సెలవులో పంపించడం స్థానికంగా స్పెషల్ ఇంజనీర్ తో బేరసారాలు కుదుర్చుకుని రాజేందర్ రెడ్డి స్థానంలో అతనికి నియమించడం ఇక అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించడం సాధారణ మండల స్థాయి అధికారి ప్రభుత్వం మండలానికి అభివృద్ధి పథంలో నడిపించేందుకు వెచ్చించిన కోట్ల రూపాయలు కమిషన్ నాసిరకం పనులతో అధికారి కాంట్రాక్టర్ గా మారి ఏఈ తనతో పాటు జిల్లా అధికారులను సైతం తన అక్రమ సొమ్ము చేసుకున్న నిధులతో అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక అక్రమ సామ్రాజ్యాన్ని సూచించడం జరిగిందని వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. నెలల నుండి వరుస కథనాలు వచ్చినా జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోవడంతో పంచాయతీరాజ్ ఉన్నత అధికారి దృష్టికి మహదేవ్పూర్ ఏఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం వ్యవహారం ఎట్టకేలకు చేరడంతో ఒకవైపు రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారి కంగు తినడంమే కాకుండా రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ,కమిషనర్, రాజేందర్ రెడ్డి లీలలను చదివి ఆశ్చర్యానికి గురి అయ్యారఅని ఒకటే ఏఈ స్థాయి అధికారి ఇంత పెద్ద అవినీతికి పాల్పడిన జిల్లాలోని అధికారులు స్పందించ లేక పోవడం వెనుక కారణం ఏమిటి అని యావత్ అధికారులతోపాటు మండలానికి విజిలెన్స్ అధికారులను తరలించి రాజేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు చేపట్టిన పనుల విషయంలో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

 *ఏఈ ఏమి చేయలేదు కుట్రపూరిత భాగంలో ఎస్సీ ముందస్తు రిపోర్ట్ అందించే ప్రయత్నం.?* 

 

ఏఈ రాజేందర్రెడ్డి ఇలాంటి అవినీతి చేయలేదని కేవలం పత్రికల్లో కావాలని వార్తలు రాయడం జరుగుతుందని పై అధికారులకు పై అధికారికి తెలిపి ఏఈ చేసిన అక్రమాలు జిల్లా అధికారుల పాత్ర కూడా ఉందని అందుకే ఇన్ని కాపాడేందుకు ఎస్ సి మండలాన్ని సందర్శించి బినామీలకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి వారితో మండలంలో అవినీతిపై వాంగ్మూలాలు తీసుకొని పంచాయతీ రాజ్ రాష్ట్ర ఉన్నత అధికారి కి మండలంలో ఎలాంటి అవినీతి జరగలేదని ముందస్తుగానే నివేదిక పంపినందుకు సిద్ధం చేసి క్రమంలోనే ఎస్ ఈ మహదేవ్పూర్ మండలానికి పర్యటించేందుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

 *సార్ ఏవీ కాలేదు అంతా వట్టిదే, ముందుగా రిపోర్టు ఇవ్వండి ఈ ఈ ,ఎస్ ఈ ముందుగా లే మంతనాలు చేసుకున్నట్లు సమాచారం..!?* 

 

 

కోట్ల రూపాయల కుంభకోణం లో ఏ ఈ నుండి ఎస్ సే  వరకు అందరూ భాగస్వాములే నని చెప్పడంలో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కుంభకోణం వ్యవహారం అరవై ఎనిమిది రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లో ఉన్నప్పటికీ  ఎస్ సి ఎప్పుడు కుంభకోణం వ్యవహారానికి సంబంధించి విచారణ అధికారికి మెమో జారీ చేయడం ఇలాంటి చర్యలకు సతీ మీరా అని ప్రేక్షక పాత్ర వహించిన ఎస్ ఈ, ఈ ఈ ల కు రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నత అధికారి దృష్టికి వెళ్లగానే ఎస్సీ ఈఈ లకు తమ పదవీ బాధ్యతలు గుర్తుకురావడం జరిగింది. ఉన్నత అధికారి విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి పనులను విచారణ చేపట్టి పరిస్థితులు తలెత్తడంతో ఏమీ తోచని ఎస్సీ ఈ ఈ ఇల్లు ముందస్తు మండల పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎస్సీ ఈఈ లు ముందుగానే ఒక కుట్రపూరిత వ్యవహారాన్ని సార్ మనమే విజిలెన్స్ అధికారులకు ముందు మండలాన్ని సందర్శించి అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని ఏమీ కాలేదని పలు బినామీలతో కలిసి వారి పేర్లతో సహా పై అధికారులకు నివేదిక ఇస్తే సరిపోతుందని ఈఈ ఎస్సీ కు తెలిపినట్లు సమాచారం. ఎ ఈ కి కాపాడే కుట్రలో భాగమే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ మండలానికి సందర్శించి ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ రాజ్ కు తప్పుడు నివేదిక అందించే క్రమంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం.

 

 *నేటిధాత్రి ముందే చెప్పింది  భారీ కుంభకోణంలో ఏఈ నుండి ఎస్సీ వరకు పాత్ర ఉందని, ఎస్సీ పర్యటన మరిన్ని నిజాలు వెలికి తీస్తుంది..!?* 

 

 

ఒక చిన్న బాధితులు సాక్ష్యాధారాలతో నేటి ధాత్రి మండలంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అభివృద్ధి పనుల పేరిట ఏ ఈ రాజేందర్ రెడ్డి చేసిన కోట్ల కుంభకోణాన్ని వెలికి తీయడం లో నేటి ధాత్రి సఫలీకృతం కావడం జరిగింది. నేటి ధాత్రి వార్తలను ప్రజల్లో ఎంతో ఆదరణ రావడం వార్తలను చూసిన ప్రజల్లో ఏ ఈ చేసిన అరాచకాలను బయటపెట్టేందుకు బాధితులు నేటి ధాత్రిని ఆశ్రయించడం ప్రారంభించడం జరిగింది. ఒక చిన్న సంఘటన తో ఏ ఈ మండలంలో నాలుగు సంవత్సరాలుగా భారీ మండలానికి ప్రభుత్వం కేటాయించే నిధుల్లో కోట్ల రూపాయల కుంభకోణానికి శ్రీకారం చుట్టడం జరిగింది రోజుకో బాధితులు రావడంతో కుంభకోణం అంతా బయట పడింది. ఇక ఈ కుంభకోణం సాక్ష్యాధారాలతో బయటపడుతున్న జిల్లా స్థాయి అధికారులు మాత్రం స్పందించలేదు ఈఈ ,ఎస్ సి, డి ఈ, తమకు ఏమీ తెలియనట్లుగా బినామీలతో కుట్రపూరిత వ్యవహారాన్ని కూడా పన్నారు, తమ పరువు పోయిందని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు, ఇన్ని వార్తలు వచ్చినప్పటికీ సాక్ష్యాలు కూడా ప్రజల ముందు వచ్చినప్పటికీ ఎస్సీ స్పందించకుండా కాలయాపన చేయడం జరిగింది. కుంభకోణంలో ఏఈ నుండి ఎస్సీ వరకు అందరూ పాత్రధారులే అని అందుకే ఈ పై చర్యలకు ససేమీరా అంటున్నారని నేటి రాత్రి ముందే చెప్పింది. ఉన్నత అధికారి విజిలెన్స్ విచారణకు ఆదేశించగా ముందే కుట్రపూరిత వ్యవహారం పన్ని మండలాన్ని సందర్శించి తప్పుడు నివేదిక అందించే ప్రయత్నం ఎస్సీ సందర్శనకు మండలంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పుటకు ఇది ఒక సాక్ష్యం గా చెప్పొచ్చు. ఇక ఎస్సీ మండలానికి సందర్శించి ఇలాంటి నివేదిక ఇస్తాడు అన్నది వేచి చూడాల్సిందే.

 

 *ఉమ్మడి మండలంలోని రాజేందర్ రెడ్డి  బాధితులంతా తమ గోడును వెళ్లబోసే సమయం ఆసన్నమైంది..!* 

 

మండలంలో భారీ కుంభకోణానికి శ్రీకారం చుట్టిన ఏ ఈ రాజేందర్ రెడ్డి చే పీడించే పడ్డ బాధితులకు ప్రజల సొమ్ము అక్రమంగా సొమ్ము చేసుకున్న రాజేందర్ రెడ్డి నుండి తిరిగి ప్రజల సొమ్ము బాధితులకు న్యాయం జరిగే సమయం ఆసన్నమైన ట్లు తెలుస్తోంది. మండలంలో చిన్న గుత్తేదారులు నీటికి బిల్లు రాక ఇబ్బందులు పడుతున్న గుత్తేదారులు మండలంలో అభివృద్ధి పేరిట చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలు భారీగా ఉన్నప్పటికీ ఆయా గ్రామానికి సంబంధించిన ప్రజలు సైతం తమ గ్రామాల్లోని నాసిరకమైన అభివృద్ధి పనులపై విజిలెన్స్ ద్వారా విచారణ ఎస్సీ కి తెలుపుటకు ఒక అవకాశం కలగవచ్చు. ఒకవేళ మండలానికి ఎస్సీ పర్యటిస్తే బాధితులంతా ఒకటై తమ గోడును అలాగే ఆయా గ్రామాల ప్రజలు కూడా డివిజన్ కార్యాలయానికి చేరింది విజిలెన్స్ విచారణకు ఆదేశించి తమకు అందించిన నిధులు దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయలు తన జేబుల్లోకి మళ్లీ ఎంచుకున్న ఏ ఈ తో పాటు ఇతర అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మండలానికి ఎస్సీ సందర్శిస్తారు లేదో మండలానికి సందర్శించిన ఎస్ సి బాధితుల నుండి వివరాలు ని స్పష్టంగా స్వీకరిస్తారో లేక బినామీలతో కలిసి ఇలాంటి నివేదిక ఇస్తారన్నది వేచిచూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!