డిప్యూటి తహశీల్దార్ సివిల్ సప్లై సర్కిల్ డి ఎం అబ్దుల్ రజాక్
మొగుళ్ళపల్లి నేటిధాత్రి
పౌర సరఫరాల కమిషనర్ హైదరాబాద్ ఆదేశముల మెరకు మొగుళ్ళపల్లి మండలము లోని మహాత్మా గాంధీ జ్యోతి బాబు పూలే బాలుర వసతి గృహమును తనిఖీ చేసిన డిప్యూటి తహశీల్దార్ సివిల్ సప్లై అధికారి. ఈ తనిఖీ లో హాస్టల్ లో విద్యార్థులు భోజనం చేసే బియ్యం నిలువ, బియ్యం నాణ్యత ను, విద్యార్థుల హాజరు పట్టికను భోజనం తీసుకున్న విద్యార్థుల సంఖ్య ను డిప్యూటి తహశీల్దార్ సివిల్ సప్లై చిట్యాల సర్కిల్ డి ఎం అబ్దుల్ రజాక్ పరిశీలించి హాస్టల్ లో విద్యార్థులకు సరైన నాణ్యత తో భోజనం అందిస్తున్నారని కానీ నిలువ ఉన్న బియ్యంలో 16 బియ్యం బస్తాలలో పురుగులు ఉన్నవని గుర్తించి వాటిని మార్చుటకు చూచించారు.