నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్,మహాబూబబాద్, ములుగు జిల్లాల పరిధిలో జిల్లా స్థాయి టార్గెట్ బాల్ క్రీడా సెలెక్షన్స్ ఈ నెల 19 న నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యాట రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్,మహాబూబబాద్, ములుగు జిల్లాల స్థాయి సబ్ జూనియర్ బాల,బాలికల టార్గెట్ బాల్ క్రీడా సెలెక్షన్స్ ఈ నెల 19 న నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివారులో గల శివాని పబ్లిక్ స్కూల్ వద్ద నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.సెలెక్షన్స్ కు హాజరగు క్రీడాకారులు 2007 జనవరి 01 తేదీ తర్వాత జన్మించి ఉండాలని అన్నారు.రూ.100 ఎంట్రీ ఫీజు, ఆధార్ కార్డు,ఒక పాస్ ఫోటో, టీమ్ ఫారంతో రావాలని,టీమ్ ఎంట్రీ ఫారంను నింపి ఈ నెల 18వ తేది ఉదయం 10 గం.లోపు 9666623438 నెంబర్ కు వాట్సప్ ద్వారా పంపాలని కోరారు.జిల్లా స్థాయిలో సెలక్ట్ అయిన క్రీడాకారులు ఈ నెల 26,27వ తేదిలలో వరంగల్ జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు.