ఆలోచింపజేసేలా ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం
కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికకు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ కోమటిపల్లి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయంపూట యధావిదిగా బడిబాట కొనసాగిస్తూ గుర్తించిన విద్యార్థుల ఇంటికి,తండాలకు వారి తల్లిదండ్రులు అందుబాటులో ఉండే సాయంకాల వేళల్లో వెళ్ళి *’మీ పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడిలో చేర్పించండి…వారి చదువుకు పూర్తి బాధ్యత మాది’* అంటూ భరోసా కల్పిస్తున్నారు. వారితో పాటు సర్పంచులు,ప్రజాప్రతినిధులు కోమటిపల్లి సర్పంచ్ నీలం యాకయ్య,తారాసింగ్ తండా సర్పంచ్ యస్.శంకర్ ఇతర ప్రజాప్రతినిధులు బడిబాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.శుక్రవారం సాయంకాలం మొదలుకుని సాయంత్రం రాత్రి 9గంటలవరకు కోమటిపల్లి గ్రామ చుట్టుపక్కల ఉండే వివిధ తండాలను సందర్శించారు.కాలినడకన పిల్లలు బడికి రావడం ఇబ్బందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుచేయగా ఒక వాహనాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వగా,తనవంతుగా వాహనానికి అయ్యే రెండు నెలల ఖర్చు భరిస్తానని ధాత జల్లె శ్రీనువాస్ ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం రుక్ముద్ధీన్, ఉపాధ్యాయులు నరేందర్ ఇల్లెందుల,మధుకర్,కో ఆప్షన్ మెంబర్ కొమురయ్య, వార్డుమెంబర్స్,యూత్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.