ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, 6వ వార్డులోని బాబా నగర్ కాలనీలో సీసీటీవీ కెమెరాలు మరియు ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు.సాయంత్రం ముఖ్య అతిథులుగా విచ్చేసిన జహీరాబాద్ రూరల్ ఎస్ఐ శ్రీ కాశీనాథ్ మరియు సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ సీసీటీవీ కెమెరాలు, ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు.బాబా నగర్ నాయకులు మరియు యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
