సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది. ఈ రక్తదాన శిబిరం ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో తో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి నిండు ప్రాణాలను కాపాడాలని సంకల్పంతో రక్తదానం చేస్తున్న రక్తదాతల స్ఫూర్తి ఎంతో గొప్పదని , తెలియజేస్తూ రక్తదానం తో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని, మన ఆరోగ్య స్థితిని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ అభినయ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.