కుప్పానగర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : ఝరాసంగం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన బేగరి ఉషమ్మ (65), భర్త సంగప్ప, గురువారం (15-01-2026) ఉదయం 10:30 గంటల నుండి అదృశ్యమయ్యారని ఆమె కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ఉషమ్మ తిరిగి ఇంటికి రాలేదని అన్నారు. అనంతరం బంధువులు, పరిచయస్తులను సంప్రదించగా ఆమె ఎవరి ఇంటికీ రాలేదని తెలిసిందన్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఉషమ్మను గుర్తించినట్లయితే లేదా ఆమె ఆచూకీ తెలిసినట్లయితే 9912519657 నంబర్కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
