ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

◆:- ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన వంతెన

◆:- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T122654.349.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రా ష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన, ప్రభుత్వాలు మా 8న కొన్ని పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి: మండల పరిధిలోని ఝరాసంగం, చిలపల్లి రహదారిపై నూతన వంతెన గత ఎనిమిది ఏళ్ల క్రితం మంజూరు అప్పట్లో ఆ వంతెన పూర్తయితే పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్లపల్లి తాండ, ఎల్గోయి గ్రామాలకు వెళ్లే వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తప్పుతాయని అందరూ భావించారు. కానీ అప్పట్లో వంతెన ని ర్మా ణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రా రంభించి చేతులు దులుపుకొని వెళ్లి పోవడంతో ఆ వంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోయింది.

2017 ఆగస్టు 11న ప్రధానమంత్రి సడక్ యోజన ని ధుల క్రింద సుమారు 55 లక్షలు నిధులతో మంజూరైన ఈవంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోవడంతో ఆ యా గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బర్దిపూర్,పొట్టిపల్లి చిలపల్లి చిలపల్లి తం డా, ఎల్గోయి గ్రామాల ప్రజలతో పాటు కేతకి సంగమేశ్వ ర స్వామి ఆలయానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు.ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మా ణానికి అదనపు నిధులను మంజూరు చే యించి అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తి చేయగలరని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

◆:- వంతెనకు పూర్తి కావాలంటే రూ.70 లక్షల

◆:- నిధులు కావాలి…. (పిఆర్ఎ శశిధర్ రెడ్డి)

అసంపూర్తిగా ఉన్న వంతెన కు పూర్తి చేయాలంటే రూ. 70 లక్షల నిధులు అవసర మవుతాయని వాటిని మం జూరు నిమి త్తం ప్రతిపాద నలు తయారు చేసి పంపిం చడం జరిగింది.

◆:- ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం…. (ఎండి.ఆరిఫ్, చిలపల్లి గ్రామస్థుడు)

రహదారిపై వంతెనలేకపో వడంతో వర్షాకాలంలో తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అకస్మాత్తుగా గ్రామంలో ఎవరికై నా అనారోగ్యం పాలైతే ఆసు పత్రికి వెళ్లాలంటే కష్టంగా మారిందని త్వరలో వం తెన పూర్తి చేసి ఇబ్బందులు దూరం చేయాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version