కొమ్మాల జాతర అభివృద్ధికి కృషి చేస్తా.

కొమ్మాల జాతర అభివృద్ధికి కృషి చేస్తా

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

రేవూరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఈ.ఓ నాగేశ్వర్ రావు,ఆలయ అర్చకులు

కొమ్మాల జాతర విజయవంతం…అధికారులను అభినందించిన ఎమ్మెల్యే.

 

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

 

గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు.గత నెల నుండి ఏప్రిల్ మొదటివారం వరకు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు,జాతర నిర్వహణ విజయవంతంగా ముగిసింది.అలాగే దేవాలయం ప్రాంగణం వద్ద ప్రతీ శనివారం నిత్య అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో చేపట్టిన నేపథ్యంలో మహా అన్నప్రసాద వితరణ దాతగా దేవాలయ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి స్వర్ణలత దంపతులు ఉన్నారు.కాగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందుగా దేవాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని దేవాలయ ఈవో నాగేశ్వర్ రావు, ఆలయ అర్చకులు రామాచారి, ఫౌండర్ శ్రీనివాస చార్యులు సాంప్రదాయ పద్ధతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అర్చకులు దేవాలయ దాతలు,మాజీ చైర్మన్,ప్రతినిధులతో కలిసి గోశాల వద్ద గోమాత పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం జాతర పట్ల మండపాల ఏర్పాట్ల కోసం,అలాగే పరిసర ప్రాంతాలు రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అన్నిశాఖల అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకున్నామని పేర్కొన్నారు.అనంతరం జాతర విజయవంతం చేసిన సందర్భంగా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు,మామునూరు ఏసిపి తిరుపతి,సీఐ మహేందర్,ఎస్సై కుమార్,ప్రశాంత్ పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధులను, పోలీస్ శాఖ అధికారులను,దాతలు,ప్రతినిధులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మలపెల్లి అధ్యక్షుడు శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ కడారి రాజు మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య గౌడ్ ,ఆలయ పౌండర్ శ్రీనివాసచార్యులు,అర్చకులు విష్ణు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, మండల అధ్యక్షులు,మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల సరిత, మండల ‌సమన్వయ కమిటీ అధ్యక్షులు దూలం వెంకన్న, జావిద్,గోదాసి చిన్న,సంగెం మాజీ జెడ్పీటీసీ వీరమ్మ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కూస రమేష్ ,కొమ్మాల తాజా మాజీ ఎంపీటీసీ గోపాల్ ,ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు లావుడ్యా రాజన్న, కోల వేణు , కేలోత్ జైత్రాం,మర్రి రాజలింగం,భూక్యా రాంబాబు,వాంకుడోత్ సెల్వా, లడే రాజేశ్వర్ రావు,మండల నరేష్,ఇమ్మడి సమ్మయ్య,బోయపాటి శ్రీదేవి,యార రాజయ్య,నాగారపు సుమలత పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version