రైతును మోసం చేస్తే సహించం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ధాన్యం కొనుగోలు సెంటర్లలో తరుగు పేరుతో రైతును మోసం చేస్తే సహించమని కఠిన చర్యలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో జీవనజ్యోతి ప్లేరపి మహిళ సమైక్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు తరుగు లేకుండా లాభం పొందాలని వారు సూచించారు. అదేవిధంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకురావాలని అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు, గన్నీలు,వేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాల వివరాలు పంట నష్టం వివరాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంట నష్ట వివరాలను వ్యవసాయ ఉద్యాన శాఖల వివరాలను సక్రమంగా పంపించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్ వడ్లకొండ నారాయణ గౌడ్ మండల నాయకులు అధికారులు ఎమ్మార్వో ఎంపీడీవో మహిళా సమైక్య అధికారులు సిసి బాబా మహిళలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.