దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి.

#రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఈ 20 న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో సన్నాహాక సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల స్వామి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ
కేంద్రంలో మూడో సారీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తున్నదన్నారు. కార్మిక వర్గ సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి ముందుకు తీసుకువచ్చిందని,వీటికి వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలను అనిచి వేస్తూ కార్మిక హక్కులను కాలరసిందన్నారు. 2025 -26 బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేటాయింపులు చేసింది సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి, కార్పొరేట్ గుత్తా సంస్థలకు పెట్టుబడుదారులకు వేలకోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించిందని ఆరోపించారు.సంఘటిత అసంఘటిత కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ నెల 20 న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మాలోతు సాగర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుచ్చాకాయల కృష్ణరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్, నాయకులు బేసికె మొగిలి, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version