సమస్యల వలయంలో పరకాల ప్రభుత్వ పాఠశాలలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T153341.126.wav?_=1

సమస్యల వలయంలో పరకాల ప్రభుత్వ పాఠశాలలు

స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సమస్యలు తీర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాడ్

పరకాల నేటిధాత్రి

ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలమరియు పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించారు.ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక మరియు వర్షం వస్తే కనీసం నడవలేని పరిస్థితి ఉందన్నారు.

అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ నూతన బిల్డింగ్ నిర్మించాలని,మల్లారెడ్డి ప్రైమరీ స్కూల్లో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వర్షం వస్తే కనీసం కూర్చొని చదువుకుందాం అంటే పై రేకులకు హోల్స్పడి వర్షం నీరు క్లాస్ రూములో నీరు నిలిచిపోవడం వల్ల విద్యార్థులు చదువుకుందాం అంటే ఇబ్బంది పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పట్టణంలో ఉన్న విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేదంటే పెద్దఎత్తున పట్టణంలో మరియు జిల్లా పరంగా ఉద్యమం చెప్పడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్,బొజ్జ హేమంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,కార్యదర్శి కోగీల సాయి తేజ ల్,ప్రభుత్వ కాలేజ్ ప్రెసిడెంట్ ప్రభాస్,ప్రధాన కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షుడు రోహిత్,సహాయ కార్యదర్శి అవినాష్,బన్నీ,రాహుల్,విజయ్ సూర్య,అరవింద్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version