ఎలక్షన్ కమిషన్ మోడీ షా కనుసన్నాలో పనిచేస్తుంది

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-18-4.wav?_=1

ఎలక్షన్ కమిషన్ మోడీ షా కనుసన్నాలో పనిచేస్తుంది

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ 2024 లో జరిగిన పార్లమెంటు ఎలక్షన్ పై అనేక అనుమానాలు ఉన్నాయని మీడియా సమావేశం పెట్టి విషయాలను చెప్పారు కర్ణాటక రాష్ట్రంలోని మహాదేవ్ అనే నియోజకవర్గం లో 40 మందితో 6 నెలలు రాహుల్ గాంధీ యొక్క టీం వర్క్ చేసింది అక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని తెలుసుకున్నారు లక్ష దొంగ ఓట్లను వారు గుర్తించారు ఓకే ఇంటి నెంబర్లు కనీసం ఒకే ఒక బీజేపీ కార్యకర్త ఉండగా పదివేల ఓట్లను అక్కడ సృష్టించారు అని బిజెపి పార్టీ మోడీని అమిత్ షా ను విమర్శించారు ఇలాంటి ఘటనలు జరుగుతున్న భారత ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మోడీ అమిత్ షా కనుషన్నాలో ఎలక్షన్ కమిషన్ నడుస్తుందని వారు అన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలి ఎలక్షన్ కమిషన్ కానీ 74 సంవత్సరాల వయసు వారికి ఫామ్ 6 కొత్త ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ కల్పించాలి 74 సంవత్సరాల వయసు వారికి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు హక్కు కల్పించడం ఏంటి అని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషనర్ ను నిలదీశారు కర్ణాటక రాష్ట్రంలో ఒక్క మహాదేవ్ అనే నియోజకవర్గంలో 36000 వేల ఫేక్ ఓట్లు సృష్టించారు భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ని దొంగ ఓట్లను బిజెపి పార్టీ సృష్టించిందో విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని వారు అన్నారు రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశానికి సేవ చేయడానికి ఉంది వారి కుటుంబంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు అయినా దేశం కోసం సేవ చేయడానికి వారు ఏ రోజు కూడా వెనుక ఆడలేదు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ అప్పం కిషన్ అంబాల శ్రీనివాస్ ముంజల రవీందర్ గౌడ్ జెంబోజ్ పద్మ ఉడుత మహేందర్ బౌత్ విజయ్ కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version