నర్సంపేటలో ‘ఉద్యమ పొద్దు’ దినపత్రిక ఆవిష్కరణ

నర్సంపేటలో ‘ఉద్యమ పొద్దు’ దినపత్రిక ఆవిష్కరణ

ప్రజా సమస్యలపై స్వరం వినిపించాలి

చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ఉద్యమ పొద్దు దినపత్రికను ఆవిష్కరించారు. చైర్ పర్సన్ స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో బండారి సుమంత్, మాదారపు శ్రీనివాస్, కొయ్యడ సుధాకర్, వేల్పుల ప్రణయ్ భాస్కర్ స్థాపించిన ఈ దినపత్రికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్రికలు ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా పనిచేయాలని పేర్కొన్నారు. ఉద్యమ పొద్దు దినపత్రిక నిరంతరాయంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి విశ్వాసాన్ని సంపాదించుకోవాలని సూచించారు. గ్రామ, పట్టణ స్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమాజ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ కన్నా, నర్సంపేట మండల యూత్ అధ్యక్షుడు బొంత రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version