*ఓంకార్ గారి శత వేలాదిగా తరలిరావాలి *.!

*ఓంకార్ గారి శత జయంతి సభకు వేలాదిగా తరలిరావాలి *

ఎంసిపిఐ (యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి

మాదన్నపేట లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 12న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మచ్చాపురం గ్రామంలో గల స్థూపం వద్ద జరిగే అమరజీవి,అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఎంసిపిఐ(యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఓంకార్ శతజయంతి సభ
వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ ఆనాడు నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజల ప్రతినిధిగా ఎన్నికైన ఓంకార్ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అసెంబ్లీలో గలమెత్తాడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా , సమస్యలను అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడన్నారు. నేటి పాలకులు సమస్యలు తీర్చకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ పేదవాళ్లను మరింత పేదవాళ్లుగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్య మానవుని కనీస అవసరాలను తీర్చకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వ్యాపార లావాదేవీల కోసం పాకులాడుతూ కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.ఓంకార్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ఈ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు .ఈ సభలో ప్రముఖ కవులు ,గోరటి వెంకన్న ,జయరాజు ప్రముఖ కవి , గాయకులు యోచన , ప్రజాకళాకారులు , వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు,మేధావులు విద్యార్థులు,ప్రజాసంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,అనుమాల రమేష్,
కేశెట్టి శ్రీను ,కొప్పుల సమ్మక్క,కర్నే సాంబయ్య ఆకుల రాజేందర్, కందికొండ సాంబయ్య ,వక్కల రాజమౌళి , కేశెట్టి పెద్ద సాంబయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version