ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

మండల పరిధిలోని కామారెడ్డి పల్లి లో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారుల కొరకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి యంపీడీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మరియు నిర్మాణంలో ఏలాంటి అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే నిర్మించాలని,ఇంటిని 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలని ఎక్కడ జియో కోఆర్డినేట్స్ తో ముగ్గు పోస్తే అక్కడే నిర్మాణం చేయాలని అన్నారు.ఇంటి నిర్మాణం ప్రారంభం కాగానే పంచాయతీ కార్యదర్శులు యంపీడీఓ కు ఇసుక మరియు మట్టి కొరకు లేఖ ఇస్తే తహసీల్దారు నుండి ఉచిత టోకెన్ తెప్పించి ఇవ్వ బడునని ట్రాన్స్పోర్టేషన్ మాత్రం లబ్ధిదారులే భరించాలని,మంజూరు విషయంలో కానీ చెల్లింపు విషయంలో కానీ మధ్యవర్థుల ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎప్పటి కప్పుడు పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇస్తే సంబందిత అధికారుల వచ్చి రికార్డు చేసి వెంటనే బిల్లు చెల్లించడం జరుగుతుందని అన్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా లబ్దిదారులకు సహకరించాలని సంవత్సరం లోపు అందరూ గృహ ప్రవేశం చేయాలని సూచించారు

 

Mandal Parishad Development Officer Peddi Anjaneyulu.

అనంతరం నాగారం గ్రామంలో 38 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా అందులో 11 ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ శ్రీలత,మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version