మూడో రోజు ముగిసిన ఆట
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 271/4 స్కోర్ చేసింది. హెడ్(142) అజేయ శతకంతో నిలిచాడు. దీంతో ఇంగ్లండ్పై ఆసీస్ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అడిలైడ్ వేదికగా యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 66 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్తో కలిపి ఆసీస్ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఇంగ్లండ్పై ప్రదర్శిస్తుంది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(142*) అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో అలెక్స్ కెరీ(52*)హాఫ్ సెంచరీతో సూపర్ నాక్ ఆడుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ ఐదో వికెట్ను అజేయంగా 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
