నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి

ఏఐఎఫ్ టియు ప్రజా సంఘాల డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్ టీయు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. టి రత్న కుమార్. అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి.
రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు.
వై .మల్లేష్. జి .అంజయ్య. ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని -29. కార్మిక చట్టాలను అమలు పర్చాలని
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ మోడీ -అమీషా ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను
అనుసరిస్తూ. కార్మికులు అనేక ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29. కార్మిక చట్టాలను
నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పరిశ్రమంలో అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కార్మిక ఉద్యోగ సంఘాలు అనేక నిరసనలు భారత్ బందులు, టోకెన్ సమ్మెలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసినప్పటికీ కార్మికుల అభిష్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి. కార్మిక వ్యతిరేక
ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను (21/11/25) రోజు నుండి అమలులోకి తెచ్చి. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి భారత రాజ్యాంగంలో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పొందుపరచుకున్న కార్మిక చట్టాలను హిందుత్వ మతోన్మాద బిజెపి మోడీ -అమీషా .ప్రభుత్వం. భారత కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నమని చెప్తూ మరోవైపు. లాభాల లొ నడుస్తున్న. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తూ. ఆదాని- అంబానీ-బడా పారిశ్రామిక వేత్తలకు అమ్మివేస్తూ . కార్మికులను కార్మిక కుటుంబలను రోడ్డుమీదికి నేటి వేస్తూ. అన్ని రంగాల ప్రజలను సంక్షోభములకు నెడుతు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి. భారత కార్మిక వర్గం ప్రశ్నించే హక్కు లేకుండా. ప్రశ్నించే కార్మికులను. ఎలాంటి సమాధానాలు లేకుండా. నేరుగా ఉద్యోగం నుండి తొలగించే విధంగా. బ్రిటిష్ వారిని మై మరిపించే విధంగా. కార్మిక చట్టాలను మారుస్తు. కార్మిక వ్యతిరేక. నల్ల చట్టాలను అమల్పరుస్తూ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా. మోడీ. విధానానకు వ్యతిరేకంగా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలకు ముందు. కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు పర్చాలని. నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపియాలని
కార్మికులు కార్మిక సంఘాలు ఐక్యంగాక. నాలుగు లేబర్ కోడ్స్ ను ఎత్తివేసి.29 కార్మిక చట్టాలను అమలుపరిచే వరకు ఉద్యమించాలని . రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు. ఏం. రాయమల్లు.
ఏం . పోచమల్లు. జి .రాములు. సామల అనసూర్య. వెంకటలక్ష్మి.
లక్ష్మి. రాజేశ్వరి. లత. కే .రాము. చంద్రగిరి .శంకర్. కుర్తి లింగం. కిష్ట స్వామి. తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version