కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జైపూర్,నేటి ధాత్రి:
కొత్త గనుల ఏర్పాటులో లోటు పాటు లేకుండా చూడాలి. అలాగే సింగరేణి సంస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం నిర్ణయం తీసుకున్నా ముందుగా ప్రకటించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటులో గతంలో ఏం చేశారు.ఎలా చేశారు. తెలుసుకొని లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.ఈ విషయాన్ని ఇది వరకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రస్తావిస్తానని వివరించారు.