నలబై ఆరు విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు !

నలబై ఆరు విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు, హాస్టల్ వసతిని కల్పించిన సదిశ

కరీంనగర్, నేటిధాత్రి:

 

సదిశ ఫౌండేషన్ గత పది సంవత్సరాలుగా మూడు రాష్ట్రలల్లోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతి సంవత్సరం ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ రెండు సంవత్సరాల చదువుకు అయ్యే ఫీజు, హాస్టల్ వసతిని పూర్తిగా ఉచితంగా అందచేయటం జరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా సదిశ మాథ్స్ టాలెంట్ టెస్ట్ 2024 నవంబర్లో నిర్వహించిన పరీక్షలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జోన్ లో ప్రథమ స్థానంలో నిలిచిన నలబై ఆరు మంది విద్యార్థులను ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కళాశాలలో చేర్పించామని సదిశ ఫౌండేషన్ చైర్మెన్ గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్, జోన్ ఇంచార్జి లు పవన్ , రవి, నరేంద్ర సింహా, సతీష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ గలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచితంగా విద్యను అందించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సదిశ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version