సరస్వతి మాత విగ్రహాన్ని.!

సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ డిమాండ్

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం తన సొంత ఖర్చులతో మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి శ్రీసరస్వతి మాత తల్లి విగ్రహాన్ని ఇటీవల కొందరు హిందూ వ్యతిరేక శక్తులు దుశ్చర్యకు పాల్పడి ధ్వంసం చేసి విగ్రహ చేతు విరగొట్టడం జరిగిందని ఈఘటనను భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని, ఈదుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని పట్టుకొని శిక్షించడంలో పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే పోలీసు యంత్రాంగం దాడి జరిగిన వెంటనే హిందూ సంఘాలకు తెలవడంతో హుటాహుటిన విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం అర్ధరాత్రి సమయంలో విగ్రహానికి మరమత్తులు చేపించడంలో ఆంతర్యం ఏంటని దుండగులను మాత్రం విస్మరించారని అన్నారు. దుశ్చర్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈశుక్రవారం సరస్వతి మాత విగ్రహాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూరేల శ్రీకాంత్ గౌడ్, బూతు అధ్యక్షులు రాగం కనకయ్య, గోపు అనంతరెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జి కొత్త రమేష్, ఆర్ఎస్ఎస్ నాయకులు కలిగేటి ఎల్లయ్య, సీనియర్ నాయకులు పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version