బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు
నేటిధాత్రి అయినవోలు :-
వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో శనివారం టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ టిఆర్ఎస్ ఇన్చార్జి కట్కూరి రాజు మండల నాయకుడు కొమురయ్య, దేవదాసు ఆకారపు యాదవ రెడ్డి ప్రతాపరెడ్డి చంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి రమేష్ నరేష్ రవి వీరస్వామి రవి యాదగిరి శీను అనిల్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.