గ్రామంలో అలంకరిస్తున్న గ్రామ నూతన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ఝరాసంగం గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సవాలుగా మారాయి.మురికి కాలువల్లో చెత్త పేరుకుపోవడం దోమలు వ్యప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వినోదా బాలరాజ్ ఉప సర్పంచ్ చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. ఝరాసంగం సర్పంచ్ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలోని మురికి కాలువలు శుభ్రం చేయించి గ్రామ వీధులలో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు. సర్పంచ్ వినోదా బాలరాజ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలవకుండా చూడడం గ్రామ పంచాయతీ పాలకుల బాధ్యత అని అన్నారు.
