కక్ష పూరిత వైఖరి చూపిస్తున్న పరకాల ఎమ్మెల్యే.

కక్ష పూరిత వైఖరి చూపిస్తున్న పరకాల ఎమ్మెల్యే.

⏩ 16వ డివిజన్ అభివృద్ధి పై ఎమ్మెల్యే రేవూరి దృష్టి సారించాలి.

⏩ ఓట్లు వేయలేదని కారణంతో అభివృద్ధి పనులను నిలిపివేసిన స్థానిక ఎమ్మెల్యే.

⏩ ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలి.

16వ డివిజన్ కార్పొరేటర్. సుంకరి మనీషా శివకుమార్

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

 

వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ లోని కీర్తినగర్ లో కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పర్యటించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో కీర్తినగర్ కాలని అభివృధి కొరకు ఒక కోటి యాభై లక్షలు మరియు గరీబ్ నగర్ అభివృధి కొరకు ఒక కోటి నలభై లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించి,పనులు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.

దాంతో టెండర్లు అయి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న రోడ్లను కేవలం ఈ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారనే కారణంగా కక్ష పూరిత వైఖరితో కాంట్రాక్టరు ను ఇబ్బందికి గురిచేస్తూ పనులు ప్రారంభించకుండా ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు.

పక్షపాత ధోరణి వీడి త్వరగా పనులు ప్రారంభించాలని,గత ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనులను తిరిగి మళ్లీ శంకుస్థాపన చేస్తానని,ప్రస్తుత ఎమ్మెల్యే అనుకుంటే అందుకు కూడా సహకరిస్తామని,కేవలం ఎన్నిలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, ఇప్పుడు మాత్రం 16వ డివిజన్ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కు హితవు పలికారు.

మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన స్టేడియం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపివేయడం జరిగిందని సందర్భంగా తెలిపారు.

ఆ పనులను కూడా వెంటనే తిరిగి ప్రారంభించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని కోరడం జరిగింది.ఇలాంటి కక్ష సాధింపు చర్యలు వీడి అభివృద్ధి పై దృష్టి సారించాలని కోరారు.

పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేని సొంత పార్టీకి చెందిన తూర్పు నాయకుడు విమర్శిస్తే ఖండించలేని నాయకులు,మేము డివిజన్ అభివృధి మీద విలేకరుల సమావేశం పెడితే సంబంధం లేకుండా కాంగ్రెస్ వాళ్లు కూడా విలేకరుల సమావేశాలు పెడుతున్నారు.

దీంతో నే అర్ధం అవుతుంది,ఎమ్మెల్యే మీద మీకున్న ప్రేమ,డివిజన్ అభివృధి మీద మీకున్న చిత్త శుద్ధి అని ఎద్దేవ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షులు పోగుల సంజీవ, గ్రామపార్టీ అధ్యక్షుడు గోరుకంటి లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి మెండు కమలాకర్, మండల మహిళా అధ్యక్షరాలు కొండా రాధ,విజయ లక్ష్మీ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు,బాబు రావు,సుబోధచారి,చంద్ర శేఖర్,బొజ్జం తిరుపతి,వజినపల్లి.శ్రీను,చల్లా.కుమార్,సతీష్,కొత్తపల్లి.

రాజు,దిలీప్,అశోక్,రామకృష్ణ,బొంత.రవి,ప్రశాంత్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version