భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పెద్ద మోసం.

కాంగ్రెస్ చేస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పెద్ద మోసం

జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పెద్ద మోసమని బిజెపి, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అందులో పని చేసే అగ్రకుల నాయకులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసినవారే అదును చూసి దెబ్బ కొట్టడానికి ఈ మూడు పార్టీలు చూస్తున్నాయి ఈ పాదయాత్రను బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు నమ్మి మోసపోవద్దు ఇది ఓట్లు దండుకొనే పెద్ద కుట్రఇది.
భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ ని భారత రాజ్యాంగం రాయొద్దని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేసిన గాంధీని ఫోటొలను ఒకచోట పెట్టి పూలమాల వేయడం రాజ్యాంగాన్ని, అది రాసిన అంబేద్కర్ను అవమానించడమే దేశంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే ఆయనకి ప్రజల పైన ప్రేమ ఉన్నట్టు కాదు ఒకవేళ ఉంటే 90 శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఈ రాజ్యాన్ని అప్పగించాలి అదే నిజమైన ప్రజాస్వామ్యం. గతంలో 9సంవత్సరాల నుండి డిఎస్పి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం వర్ధిల్లాలని భారత రాజ్యాంగాన్ని పూలతో అలంకరించి ఊరేగింపు చేసింది డి.ఎస్.పి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్తంబచిహనాలు పెట్టించింది ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే డాక్టర్ విశారదన్ మహారాజు జ్ఞానాన్ని కాపీ కొడుతూ జై భీమ్ అనకున్నా భారత రాజ్యాంగం వర్తిల్లాలి అనకున్న మనుగడ లేదని ఈ నాటకాలు ఆడుతున్నారు ఇలా చేయడం సిగ్గుచేటు. భారత రాజ్యాంగాన్ని కాపాడేది ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే అని ప్రజలు గమనించాలని కోరుతున్నాం

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version