దళిత పథకాల ఆలస్యంపై విమర్శలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు చేయని ప్రభుత్వం కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసి గద్దెనెక్కి రెండున్నర ఏండ్లు గడిచిన ఆ పథకాన్ని అమలు చేయకుండా దళితులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమని హా మీలను నెరవేర్చకపోవడంపై దళిత సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఉద్యోగ భృతి మహిళలకు 2500 వంటి పథకాలు అమలు కూడా ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు దళిత బంధు యూనిట్లను వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వం లో మంజూరైన దళిత బంధు నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు తక్షణ నిధులు విడుదల చేయాలని కలెక్టర్ ఖాతాలో నిలిచిపోయిన దళిత బంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని దళిత బంధు ఖాతాలపై ఉన్న ఫీజింగ్ ను తొలగించి యూనిట్ల గ్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version