వనపర్తలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలి…

వనపర్తలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లా కేంద్రంలో పాత మార్కెట్ యార్డ్ గణపతి దేవాలయం దగ్గర ఇంటి గ్రేటడ్ మార్కెట్ లో ప్రభుత్వం నిర్మించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటన లో కోరారు
సూపర్ మార్కెట్ బ్యాంక్వెట్ హాల్‌ లను, లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారుగ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 32 షాపులు అందుబాటులో ఉన్నాయని, బ్యాంక్, సూపర్ మార్కెట్‌ ఫస్ట్ ఫ్లోర్‌లో బ్యాంక్వెట్ హాల్ కూడా లాటరి ద్వారా కేటాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 18-04-2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు ఫారం పొందడానికి ఫీజు .2,500 రూపాయలు నిర్ణయించబడిందిదరఖాస్తు ఫారం పొంది అప్లై చేసుకునేవారు దరఖాస్తు ఫారం తో పాటు డీ డీ ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు దుకాణాలకు రూ.15,000/-గా ఉండగా, బ్యాంక్వెట్ హాల్‌కు ఈఎండీ రూ.50,000/ బ్యాంక్ సూపర్ మార్కెట్‌కు ఈఎండీ రూ.25,000-గా నిర్ణయించబడిందని కలెక్టర్ తెలిపారు లాటరీ 21-04-2026 ఉదయం 11.00 గంటలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించబడుతుందని ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
డిమాండ్ డ్రాఫ్ట్ సెక్రటరీ ఏ ఎం సి వనపర్తి పేరున తీసుకుని రావాలని కోరారు. షాపుల కేటాయింపు 32 షాపులలో జనరల్ కేటగిరి 16షాపులు, బి.సి కేటగిరి 08షాపులు, యస్.సి.కేటగిరి 05 షాపులు, యస్.టి కేటగిరి 02షాపు, మరియు పి.హెచ్.సీ కేటగిరి 1 మొత్తం 32 షాపులు కలవు లాటరీ పద్ధతి ద్వారాఉంటుందని కేటాయింపులో నిబంధనలు షరతుల ఇతర వివరముల కొరకు కార్యాలయపు పనివేలలో నేరుగా కాని లేదా సెల్ నెంబర్లు 7330733292 7893633678 ఫోన్ చేసి తెలిసుకొవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

దళిత పథకాల ఆలస్యంపై విమర్శలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు చేయని ప్రభుత్వం కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసి గద్దెనెక్కి రెండున్నర ఏండ్లు గడిచిన ఆ పథకాన్ని అమలు చేయకుండా దళితులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమని హా మీలను నెరవేర్చకపోవడంపై దళిత సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఉద్యోగ భృతి మహిళలకు 2500 వంటి పథకాలు అమలు కూడా ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు దళిత బంధు యూనిట్లను వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వం లో మంజూరైన దళిత బంధు నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు తక్షణ నిధులు విడుదల చేయాలని కలెక్టర్ ఖాతాలో నిలిచిపోయిన దళిత బంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని దళిత బంధు ఖాతాలపై ఉన్న ఫీజింగ్ ను తొలగించి యూనిట్ల గ్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version