విగ్రహాలకు పూలమాలలు వేసి, జరుపుకున్న చెన్నప్ప పటేల్ వర్ధంతి…

విగ్రహాలకు పూలమాలలు వేసి, జరుపుకున్న చెన్నప్ప పటేల్ వర్ధంతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరసంగంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు అభిమానులు చెన్నప్ప పటేల్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతోష్ పటేల్, చెన్నప్ప పటేల్ మనవలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఝరసంగంలోని చెన్నప్ప పటేల్ కాలనీలో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం….

షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం : ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో రూ. 1.50 లక్షల నగదుతో పాటు విలువైన పట్టుచీరలు అగ్నికి ఆహుతయ్యాయి.ఝరాసంగం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయికిరణ్, జీపీఓ రత్నం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామానికి చెందిన రైతు హుమ్నాబాద్ వినోద సిద్ధన్న దంపతులు గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచుకున్న రూ. 1.50 లక్షల నగదు, పట్టుచీరలు, టీవీ, బీరువా, నిత్యావసర సరుకులు వంట సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 2.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. బాధితులకు జరిగిన నష్టంపై నివేదికను ప్రభుత్వానికి అందజేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయికిరణ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version