వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగింపు…

వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగింపు

దుగ్గొండి నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని వార్డు సభ్యుల కోసం నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల పనితీరు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగం, పారిశుధ్యం, అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,మండల పంచాయతీ అధికారి ఎం. శ్రీధర్ గౌడ్, ట్రైనింగ్ టిఓటి లు ఎం. నరేష్ రాజు పాల్గొని శిక్షణ ఇచ్చారు. మండలంలోని వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు సూచించారు.

వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగింపు…

వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగింపు

దుగ్గొండి నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని వార్డు సభ్యుల కోసం నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల పనితీరు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగం, పారిశుధ్యం, అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,మండల పంచాయతీ అధికారి ఎం. శ్రీధర్ గౌడ్, ట్రైనింగ్ టిఓటి లు ఎం. నరేష్ రాజు పాల్గొని శిక్షణ ఇచ్చారు. మండలంలోని వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు సూచించారు.

మూడో విడత శిక్షణ పూర్తి….

మూడో విడత శిక్షణ పూర్తి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులకు. వార్డు సభ్యులకు. ఈరోజు మూడో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా. ప్రజా పాలన.పరిపాలన లో భాగంగా. 99.వ. యాక్షన్ ప్లాన్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామంలో పరిపాలన విధానాలను ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా ఒడిదుడుకుల గురి కాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలో అవగాహన కార్యక్రమంతో పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందులో మూడో విడత ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈరోజు మూడో విడత చివరి 5.వ .రోజు వార్డు మెంబర్స్.లో శిక్షణ కార్యక్రమంలో విజయవంతంగా శిక్షణ తీసుకొని శిక్షణ ముగింపు విజయవంతంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా శిక్షణ ముగించుకున్న తంగళ్ళపల్లి మండల గ్రామాల అవార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఎంపీడీవో లక్ష్మీనారాయణ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్. ఎం. పి. ఓ. సూపరిండేoట్.రమేష్. అశోక్. వెన్నెల కార్యాలయంసిబ్బంది

వార్డ్ సభ్యులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు…

వార్డ్ సభ్యులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.సోమవారం టిఓటి ల ద్వారా గ్రామ పంచాయతీ పరిపాలన,స్థానిక సంస్థల బాధ్యతలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం,ఆర్థిక నిర్వహణ, పాలన పారదర్శకత,గ్రామ సభల నిర్వహణ,శానిటేషన్,ప్రభుత్వ పథకాల అమలు వంటి వివిధ అంశాలపై వార్డ్ సభ్యులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.మొదటి విడతగా ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 27 వరకు 10 గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.రెండవ విడతగా మార్చి 4 నుండి మార్చి మూడవ తేదీ వరకు మరో 10 గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు హాజరై,నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.ప్రజలతో సమన్వయం,పారదర్శకత,బాధ్యతాయుత పరిపాలన అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసీల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు,సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి,టిఓటి లు సురేశ్,రమేష్,దేవేందర్,సురేశ్ లు,పంచాయతీ కార్యదర్శులు,మండలంలోని వివిధ గ్రామాల వార్డ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version