కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
ప్రచారంలో దూసుకుపోతున్న తుమ్మలపల్లి లీల సంజీవులు
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలపల్లి లీల సంజీవులు గారిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని అన్నారు వార్డు అభ్యర్థి తుమ్మనపల్లి లీల సంజీవులు మాట్లాడుతూ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లింగంపల్లి శ్రీనివాస్, సార్ల లింగం ముదిరాజ్, బొచ్చు ఎల్లయ్య యాదవ్, ఏర్పుల రాజు, ఉప్పల వంశీ కృష్ణ, ఈగ కనకరాజు, రుద్రారం దుర్గయ్య, చింతల రమేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
