నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
తిమ్మాజీపేట మండలం అప్పాజీపల్లి గ్రామంలో లోని లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం నియోజవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని తెలిపారు గ్రామీణ ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తానే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
